సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువుమండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ పర్వీన్ భాను జెడ్పిటిసి కుర్లి దామోదర్రెడ్డి ఆధ్వర్యంలో తూతూ మంత్రంగా మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశములో వారు మాట్లాడుతూ ప్రజల కోసమే ఈ ప్రభుత్వం వుందని పేర్కొన్నారు. గత సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేసిన పనులు సాధించిందేమిలేదని, విద్యుత్ శాఖలో అనేక సమస్యలు ఉన్నాయని, గౌరాపురం, టీ. కుంట్లపల్లి తదితర గ్రామాలలో విద్యుత్ లైన్లు క్రిందికి వేలాడుతున్న విషయాన్ని ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకునే నాధుడే లేడని, ఇకనైనా వాటిపై దృష్టి కేంద్రీకరించాలని అల్లాపల్లి , వెంకటాపురం సర్పంచ్ లు వెంకటరమణ శంకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటాపురం ఎంపీటీసీ శ్రీనివాసులు మాట్లాడుతూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందుబాటులో స్ట్రెచర్స్, వీల్ చైర్ల సౌకర్యం లేదని, ప్రాథమిక కేంద్రం నూతన భవనాన్ని ఎప్పుడు కడతారోనంటో సభలో గర్తు చేశారు. మంజూరైన జగనన్న నూతన గృహాలకు ఇసుక దొరకడం చాలా కష్టంగా మారిందని, ఇసుక కోసం తాసిల్దార్ కు వినతి కోరితే పరిశీలించి ఇసుక తోలుకోవడానికి పరిమిషన్ మంజూరు చేస్తామన్నారు. మండలంలో పలుచోట్ల మోటార్లు మరమ్మత్తు కు గురై నెలకొన్న తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని మండల ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో ఆర్డి రాజశేఖర్, పశువైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ వ్యవసాయ అధికారి ఇలియాస్ అహ్మద్, మార్కెట్ యాడ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ లక్ష్మీదేవి , తాసిల్దార్ రామనాథ్ రెడ్డి ,కోఆప్షన్ నెంబర్ నిసార్ అహ్మద్, ఐసిడిఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, మండల విద్యాధికారి సురేష్ బాబు, రమణ, సూపర్డెంట్ రెడ్డప్ప, సర్పంచులు గోవిందు ,వెంకటరమణ, రంగారెడ్డి ,శివశంకర్ రెడ్డి, జగన్మోహన్ చౌదరి, సీనియర్ అసిస్టెంట్ గజ్జల శ్రీనివాసరెడ్డి, హెచ్ ఓ లావణ్య తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin