Monday, 27 July 2026 05:23:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెద్దమ్మతల్లి సాక్షిగా విజయం కాంగ్రెస్ దే...

Date : 14 October 2023 11:44 AM Views : 276

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్‌ 6 గ్యారెంటీ పథకాల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ ఇందుకోసం అగ్రనేతలందరూ కలిసికట్టుగా శుక్రవారం పాల్వంచ జగన్నాధపురంలో ఉన్న పెద్దమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం చెపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు మహిళలకు ప్రతీ నెల రూ.2,500, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, రైతులకు ఏటా రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, పంటకు రూ.500 బోనస్‌, ప్రతీ కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇళ్లు లేనివారికి ఇంటి స్థలంతో పాటు రూ.5 లక్షల సాయం, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తామని వివరిస్తున్నారు. నెలకు రూ.4 వేల పింఛన్‌, రూ.10 లక్షల ఆరోగ్యబీమా, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతీ మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూళ్లు నెలకొల్పుతామని చెబుతున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని, ఈసారి తమకు అధికారం ఇస్తే తప్పనిసరిగా హామీలను అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జాలె జానకి రెడ్డి, పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, బ్లాక్ అద్యక్షులు వీరయ్య చౌదరి, మైనార్టీ పట్టణ అధ్యక్షులు చాంద్ పాషా, బీసీ నాయకులు వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, స్థానిక నాయకులు దేవేందర్, శ్రీను, కిషన్, రామా, మైనార్టీ నాయకులు గౌస్ భాయ్, అయూబ్ ఖాన్, సత్యనారాయణ, సతీష్, రాజు, మహేష్, నవీన్, వెంకటేశ్వరరెడ్డి , రామారావు, శ్రీశైలం, నాగేశ్వరరావు, నిరంజన్ రెడ్డి, శ్యామ్, నరేష్, పండు, ప్రవీణ్, కాంగ్రెస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :