సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : హనుమకొండ జిల్లా నూతన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వరంగల్ కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఈరోజు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో కాంగ్రేస్ పార్టీని బలోపేతం చేయటానికి అందరి నాయకుల్ని కలవటం పత్రికల్లో చూశానని.. ఇది మంచి శుభ సూచికమని అభినందించారు. అలాగే పార్టీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు చెరవేయాలని, ఇప్పుడు జరగబోయే, భవిష్యత్తులో జరగబోయే ప్రతి ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ జెండా ఎగిరెలా కార్యాచరణ తయారుచేసుకోవాలని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
-----------------------
Reporter