సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : ప్రతి గింజనూ కొంటాం .... -రాష్ట్రంలో పెరిగిన పంట దిగుబడులు. -సాగునీటి పథకం వల్లే అద్భుత ఫలితాలు. -రైతులకు అండగా ప్రభుత్వం. -దేవరకొండ ఎమ్మెల్యే,టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దేవరకొండ శాసన సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.గురువారం దేవరకొండ మండలం కొండబిమనపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలు, పథకాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారిందన్నారు.సాగు నీటిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో రాష్ట్రంలో పంట దిగుబడి పెరిగింది అని ఆయన అన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అభివర్ణించారు. అన్నదాతలు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, తాలు, మట్టి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రైతులకు అండగా ప్రభుత్వం ఉంటుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వం క్వింటాల్ కు గ్రేడ్ -ఏ ధాన్యానికి రూ.2060, ....
-----------------------
Admin