సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : దళిత జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాశపోగు జాన్ ఆదేశాల మేరకు శనివారం నారాయణపేట్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు జి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో మక్తల్ మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దళిత జర్నలిస్ట్ ఫోరం మండల కమిటీని శనివారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి. శంకర్, ప్రధాన కార్యదర్శిగా పి. రాఘవేంద్ర సభ్యులుగా అచ్చప్ప, దినేష్, ఆంజనేయులు , శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు, మాట్లాడుతూ ... దళిత జర్నలిస్టుల హక్కుల సాధన కొరకు పోరాడుతామన్నారు. దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాల సహయ సహకారాలు అందించి, వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, 3ఎకరాల భూమి, దళిత జర్నలిస్టులకు అందే విధంగా కృషి చేయాలన్నారు. జర్నలిస్టుల పై దాడులు చేసే దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు జి. శ్రీనివాసులు, మక్తల్ నియోజకవర్గ కోశాధికారి దినేష్, ఉమ్మడి మాగనూరు మండల అధ్యక్షులు డి. ఆంజనేయులు, మక్తల్ నూతన అధ్యక్షులు జి. శంకర్ , ప్రధాన కార్యదర్శి పి. రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin