Monday, 27 July 2026 11:33:07 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దళిత జర్నలిస్ట్ ఫోరం మక్తల్ మండల కమిటీ అధ్యక్షులుగా జి. శంకర్ ఏకగ్రీవంగా ఎన్నిక...

Date : 07 May 2023 01:15 AM Views : 702

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : దళిత జర్నలిస్ట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాశపోగు జాన్ ఆదేశాల మేరకు శనివారం నారాయణపేట్ జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు జి. శ్రీనివాసులు ఆధ్వర్యంలో మక్తల్ మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దళిత జర్నలిస్ట్ ఫోరం మండల కమిటీని శనివారం ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జి. శంకర్, ప్రధాన కార్యదర్శిగా పి. రాఘవేంద్ర సభ్యులుగా అచ్చప్ప, దినేష్, ఆంజనేయులు , శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు, మాట్లాడుతూ ... దళిత జర్నలిస్టుల హక్కుల సాధన కొరకు పోరాడుతామన్నారు. దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. దళిత జర్నలిస్టులకు ప్రభుత్వం అన్ని విధాల సహయ సహకారాలు అందించి, వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, 3ఎకరాల భూమి, దళిత జర్నలిస్టులకు అందే విధంగా కృషి చేయాలన్నారు. జర్నలిస్టుల పై దాడులు చేసే దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులు జి. శ్రీనివాసులు, మక్తల్ నియోజకవర్గ కోశాధికారి దినేష్, ఉమ్మడి మాగనూరు మండల అధ్యక్షులు డి. ఆంజనేయులు, మక్తల్ నూతన అధ్యక్షులు జి. శంకర్ , ప్రధాన కార్యదర్శి పి. రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :