సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ కమిటీలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని ఫరూఖ్ నగర్ మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జి. బాలరాజ్ గౌడ్ అన్నారు. ఆదివారం మండలంలోని చించోడు గ్రామానికి చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫరూక్ నగర్ మండలంలోని చించోడు గ్రామంలో బీసీ సంఘం ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షులు బసప్ప, ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగి సాయిలు ఎస్టీ సెల్ అధ్యక్షులు సక్రు నాయక్ ల ఆధ్వర్యంలో చించోడు గ్రామం పెద్దల సమక్షంలో ఈ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందనీ ఆయన తెలిపారు. బీసీ సెల్ గ్రామ కమిటీ అధ్యక్షులుగా మిద్దె యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బండల నరేష్, ఉపాధ్యక్షులుగా కోట శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిలు చీర మల్లేష్, కార్యదర్శులు చెక్కల శివ, బండాల లింగం అదేవిధంగా చించోడు గ్రామ ఎస్సీ కమిటీ అధ్యక్షులుగా పుడుగుర్తి గోపాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోట రిక్కీ కృష్ణయ్య, ఉపాధ్యక్షులు మ్యారం శివ, అంజయ్య, ప్రధాన కార్యదర్శి శివమల్లా శ్రీశైలం, కోశాధికారి నీరటి బాలరాజ్, చించోడు ఎస్టీ గ్రామ కమిటీ అధ్యక్షులుగా హర్యానాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఉపాధ్యక్షులు రాజు నాయక్, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్ తో పాటు సర్పంచ్ శ్రీనివాస్, ఐఎన్టియుసి కార్యదర్శి రఘు, తాలూకా ఎస్టీ సెల్ అధ్యక్షులు శీను నాయక్, చించోడు గ్రామ కమిటీ అధ్యక్షుడు అస్మత్ బాబా, సీనియర్ నాయకుడు ఎల్లప్ప, రుస్తుం పెంటయ్య, ఎంపీటీసీ రాజు, హరికృష్ణ, అనంతం, చీర అంజయ్య, శివ ఎక్స్ ఎంపిటిసి, దాస్య నాయక్, లక్ష్మణ్ నాయక్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin