సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మేళ్ళచెరువు : డా . ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ బి ఎస్ పి రాష్ట్ర అద్యక్షులు ఆదేశాల మేరకు మేళ్ళచెరువు మండల కేంద్రము లో బి ఎస్ పి నాయకులు వట్టే జానయ్య యాదవ్ కి మద్దతుగా నిలుస్తారని పోలీస్ వారు ముందస్తు గా అరెస్ట్ చేశారు . రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒత్తిడితో ఉమ్మడి నల్లగొండ జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ (డీసీఎంఎస్ ), బి సి నేత వట్టే జానయ్య యాదవ్ పై అక్రమంగా 70 కేసులు పెట్టడం సరికాదని బహుజన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి) హుజూర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు మంద రవి అన్నారు. బహుజనుల ఔనత్యాన్ని ఓర్చుకోలేక ఉద్దేశ పూర్వకంగా వారిపైన కేసులు బనయిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో బహుజనులంతా ఏకమై ఏనుగు గుర్తు కు ఓటు వేసి రాజ్యాధికారాన్ని సాదించుకుందామని పిలుపు నిచ్చారు. ఇట్టి కార్యక్రమము లో బి ఎస్ పి మండల నాయకులు,బూత్ లెవల్ నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin