సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ : రోడ్డు నియమ నిబంధనలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉంటేనే ప్రమాదాల నివారణ సాధ్యమవు తుందని కోదాడ డిఎస్పి ప్రకాష్ , మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ బాబు లు అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని స్థానిక లారీ అసోసి యేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ 35వ రోడ్డు భద్రత వారోత్సవాల్లో వారు ముఖ్యఅతిథి లుగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ, నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణ సమిష్టి బాధ్యతగా గుర్తించాలని అన్నారు.80 శాతం ప్రమాదాలు మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయని సెల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి, మితిమీరిన వేగంతో వాహనాలు నడపడంతో ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై లారీ యజమానులకు, డ్రైవర్లకు వివరిస్తూ అవగాహన కల్పించారు.అనంతరం ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి అంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ రాము, ఎస్సై. యాదవేందర్ రెడ్డి, కోదాడ అసోసియేషన్ అధ్యక్షులు కనగల. నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ రామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin