సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ఇటీవల భువనగిరి, సూర్యాపేట సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల కళాశాల లో వరసగా విద్యార్థినిలు మరణించిన ఘటనల పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించి దోశుల పై కఠిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలనీ ప్రముఖ న్యాయవాది, మాలమహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తళ్లమళ్ళ హసేన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు... ఇటీవల సూర్యాపేటలో సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల కళాశాల ఇమామ్ పేట లో మరణింంచిన దగ్గుపాటి వైష్ణవి తల్లి తండ్రులను కుటుంబ సభ్యులను నిన్న రాత్రి పరమర్శించి న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని చెప్పినారు .మరణించిన విద్యార్థిని కుటుంబాలకు ఒక కోటి రూపాయలు ఎక్సగ్రెసియా ఇవ్వాలని, కుటుంబములో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినారు. మాలమహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ముండ్లగిరి కాంతయ్య, మాలమహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బోయిల అఖిల్, న్యాయవాదుల సంఘము జిల్లా అధ్యక్షులు ఏడిండ్ల అశోక్, జిల్లా ప్రధాన కార్య దర్శి గాజుల నర్సయ్య, సమతా సైనిక్ దళ్ సూర్యాపేట జిల్లా నాయకులు ఏడ్ల కళ్యాణ్, ఎలిజాల సురేష్, ఏడుకొండలు,తదితరులు వైష్ణవి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
-----------------------
Admin