సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క సారక్క మేడారం జాతరలో భక్తుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తినుబండారాలను పరిశీలించి నాణ్యమైన ఆహారo మాత్రమే సేకరించి తినాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి వరంగల్, కరీంనగర్ ,ఆదిలాబాద్ జిల్లాల ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అమృత శ్రీ , బాపూజీ , కృష్ణమూర్తి, రోహిత్ రెడ్డి, వాసు రామ్, ఎన్ అనూష, ఆర్ అనూష, ప్రత్యూష లను నియమించగా వారు మహా జాతరలో విడివిడిగా ప్రాంతాలవారీగా విడిపోయి, ఆయా ప్రదేశాల్లో ఆహార పదార్థాలు తయారుచేయు ,తయారుచేసిన, రకరకాల రంగులు కలిపిన పదార్థాలను పరిశీలించి సుమారు 15 లీటర్ల మరిగిన నూనెను పారబోసి వ్యాపారులకు తగు సూచనలు సలహాలు ఇచ్చి మంచి శుచి శుభ్రమైన ఆహార పదార్థాలను మాత్రమే భక్తులకు కొనుగోలుదారులకు అందించాలని సూచిస్తూ ఒకవేళ ఎవరైనా వ్యాపారులు అత్యాశకు పాల్పడి తినుటకు వీలుగాని తినుబండారాలను విక్రయించినట్లయితే చట్టరీత్యా చర్య తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆయా తిను బాoడాగార కేంద్రాల వద్ద వేచి ఉన్న వినియోగదారుల, భక్తులతో మాట్లాడుతూ వేడివేడి , కల్తీ లేని శుచి శుభ్రమైన ఆహార పదార్థాలు మూత వేసి ఉన్నవి మాత్రమే భుజించాలని, తినడానికి ఏదైనా పదార్థం కొనుగోలు చేయు సమయంలో ఆ పదార్థం పై ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని ఆమోదయోగ్యమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని, రంగులు కలిపిన ఆహార పదార్థాలను, తినకూడదని త్రాగునీరు, కూల్ డ్రింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని భక్తులకు సూచించారు...
-----------------------
Admin