సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో మరపురాని ఘట్టమని, రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మిస్తామని ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావి జి ఆర్ బి ఫంక్షన్ హాల్లో డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోతెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా డివిజన్ కార్యదర్శి మహమ్మద్ రాజాసాహెబ్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరులు అసెంబ్లీ టైగర్ మద్దికాయల ఓంకార్, భీమిరెడ్డి నరసింహారెడ్డి గార్ల చిత్రపటాలకు సమావేశం పూలమాలవేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అతిధిగా హాజరైన జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 మొదలుకొని 1951 వరకు కొనసాగిందని, ఈ పోరాటంలో కమ్యూనిస్టులు నిజాం సర్కార్ కు మరియు నిజాం కు తొత్తులుగా ఉన్న రజాకార్లకు, దేశ్ ముఖ్, మరియు భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన వీరోచిత పోరాటంలో అసెంబ్లీ టైగర్ మద్దికాయాల ఓంకార్, భీమిరెడ్డి నరసింహారెడ్డి గార్లు చేసిన పోరాటం బావి తరాలకు ఆదర్శనీయమని, నేటి యువత అలాంటి గొప్ప కమ్యూనిస్టు ల చరిత్రను తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు త్యాగాలు చేస్తే, సాయుధ పోరాటంతో ఎలాంటి సంబంధం లేని బిజెపి నాయకులు రైతాంగ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన కొట్లాటగా మాట్లాడడం వారి రాజకీయ అవగాహన లేమికి నిదర్శనమని, సాయుధ పోరాటం గురించి మాట్లాడి నైతిక హక్కు వారికి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాపురావు, వంగల రాగసుధ, కన్నం వెంకన్న, మండల కార్యదర్శులు సంగతి మల్లికార్జున్, దామ సాంబయ్య, కలకోట్ల యాదగిరి,గాజుల వెంకటయ్య, డివిజన్ కమిటీ సభ్యులు గటికె జమున, తడుక కౌసల్య, గీసపాక కొమురయ్య, బుడిమే సురేందర్, బత్తిని కుమారస్వామి,అనుముల రమేష్, సొల్లేటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin