సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణ శివారులోని రాయికల్ టోల్ ప్లాజా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం పాలైనట్టు షాద్ నగర్ పోలీసులు తెలిపారు. సుమారు 40 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృత్యువు పాలైనట్టు పట్టణ సిఐ ప్రతాప్ లింగం తెలిపారు. మృత్యువాత పడ్డ వ్యక్తి సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే షాద్ నగర్ పోలీసులను అందజేయాలని కోరారు.
-----------------------
Admin