సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : ప్రజలందరూ క్రీస్తు బోధనలు తెలుసుకొని ఆయన చెప్పిన ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటూ క్రీస్తు జీవితం ఆదర్శంగా తీసుకొని, పది ఆజ్ఞాలు పాటిస్తూ ఆయన వాక్యానుసారం జీవించాలని, శాంతియుతంగా, భక్తి శ్రద్ధలతో , సుఖ సంతోషాలతో వార్షికోత్సవాలు జరుపుకోవాలని ఎంపిటిసి ల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ కోరారు. పాలక వీడు మండలం లోని నాగిరెడ్డిగూడెం ఆవాస గ్రామం బెట్టేగూడెం క్రీస్తు సంఘం చర్చ్ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజల పాపాల తొలగించుటకు శిలువ వేయబడి మరల తిరిగి వచ్చిన శాంతిదూత ఏసుప్రభువు అని,అతని మార్గంలో జీవించాలని కోరారు.క్రీస్తు బోధనలను సంఘ కాపరులు మీసాల ప్రభుదాస్,మీసాల జ్యోతిబాబు లు బోధించారు. క్రైస్తవులు చక్కని గీతాలు ఆలపించారు.ఈ కార్యక్రమంలో నాయకులు మునగాల సైదిరెడ్డి,ఒంటెద్దు మట్టారెడ్డి, కందుకూరి సైదిరెడ్డి మంద నాగయ్య,మంద సైదులు,మంద చిన లాజర్, పిట్ట అబ్రహం,ముల్కలపల్లీ శ్రీను,అరోను,మంద కర్ణకర్, పిట్ట పెద కోటయ్య,పిట్ట కోటయ్య,యూత్ సభ్యులు,సంఘ పెద్దలు,క్రైస్తవ సోదరి సోదరులు పాల్గొన్నారు.
-----------------------
Admin