సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీలలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రాజకీయ జోక్యం తగదని బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు రాపోలు నవీన్ కుమార్ అన్నారు అయన నేరేడుచర్లలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిందని కానీ ఇటీవల కాలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కమిటీలు వేశారని అందులో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నారని, అంటే త్వరలో నిర్మించబోయే ఇళ్లు కేవలం కాంగ్రెస్ పార్టీ వారికి మాత్రమే సూచనప్రాయంగా ప్రజలకు అర్థమవుతుందని అదే జరిగితే నిజమైన అర్హులకు ఎంతో అన్యాయం జరుగుతుందని నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాజకీయ జోక్యం లేకుండా చేసి ఇండ్లు లేక రోడ్లకు ఇరువైపులా జీవిస్తున్న వారికి ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తే అది ప్రజా పాలన అవుతుందని...అలా కాకుంటే అది ప్రజా పీడన అవుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు హామీలను ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే తీరా అధికారంలోకి వచ్చాక మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని దీపావళిక ముందే బాంబుల పేలుస్తామని ఒక మంత్రి అంటే త్వరలోనే టిఆర్ఎస్ మాజీ మంత్రులను అరెస్టు చేస్తావని ప్రగాల్భాలు పలుకుతున్నారని ప్రతి ఎమ్మెల్యే ఒక మంత్రి లాగా ఫీల్ అవుతున్నారని ప్రతి మంత్రి ముఖ్యమంత్రి లానే ఫీలయ్యి ఊహల్లో జీవిస్తున్నారని, త్వరలోనే ముఖ్యమంత్రి మారుస్తారని ఆ పార్టీ వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏడాదికో ముఖ్యమంత్రి మారతారనే విషయం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసునని పరిపాలించడం చేతకాక ప్రజల దృష్టి మరల్చేందుకు ఇలా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, రాం సైదులు, పెరుమాళ్ళ సతీష్ కుమార్, షేక్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin