Sunday, 26 July 2026 12:43:43 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెళ్లికి కాదన్నాడని ప్రియుడిని నరికి చంపిన ప్రియురాలు...

Date : 12 May 2023 07:21 PM Views : 655

సర్కార్ టీవీ న్యూస్ / తూర్పుగోదావరి జిల్లా : గోకవరం మండలం తిరుమలపాలెం గ్రామానికి చెందిన ఒమ్మి నాగశేషు (26), రంపచోడవరం మండలం చిలకవీధికి చెందిన కుర్ల డెబోర ప్రేమించుకున్నారు. నాలుగేండ్ల పాటు కొనసాగిన వీరి ప్రేమ వ్యవహారం నాగశేషు కుటుంబంలో తెలిసింది. ఏడాది క్రితమే గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన మరో యువతితో అతనికి వివాహం జరిపించారు. అప్పటి నుంచి ఈ విషయాన్ని ప్రియురాలి వద్ద నాగశేషు దాచి ఉంచాడు. ఇటీవల ఈ విషయం ప్రియురాలికి తెలియడంతో పలుసార్లు నాగశేషుతో డెబోర గొడవపడింది. మోసం చేసిన ప్రియుడిపై ఆమె కసి పెంచుకున్నది. స్నేహితుడైన రాజవొమ్మంగి మండలం దూసరపాడుకు చెందిన విశ్వనారాయణతో కలిసి డెబోర బుధవారం అర్ధరాత్రి నాగశేషు ఇంటికి వెళ్లింది. డాబాపై నిద్రిస్తున్న ప్రియుడిని నిద్రలేపి గొడవకు దిగింది. తన వెంట తెచ్చుకున్న కత్తిపీటతో అతడిపై దాడి చేసింది. నాగశేషు కేకలు వేయడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు పడుగులో పడి ఉన్న అతడిని అంబులెన్స్‌లో రంపచోడవరం ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితురాలిని, ఆమె స్నేహితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :