సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ పట్టణంలోని డంపింగ్ యార్డ్ ని మున్సిపల్ అధికారులతో కలసి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు గతంలో డంపింగ్ యార్డ్ అస్తవ్యస్తంగా ఉండి మున్సిపల్ వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా ఉండేది వాటి ద్వారా వచ్చే దుర్వాసన, వాటిని కాల్చడం వలన వచ్చే పొగ మూలాన చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుండే వారు కానీ గత 8 నెలలుగా ఎమ్మెల్యే పలు మార్లు డంపింగ్ యార్డు సందర్శించి అధికారులకు పలు సూచనలు చేసి డంపింగ్ యార్డ్ లోని పొగను పూర్తిగా నిర్మూలించారు అలాగే మున్సిపల్ వాహనాలు వెళ్ళే విధంగా చుట్టూ చత్తని శుభ్రంగా చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ లోని తది, పొడి చత్తలను వేరు చేయిస్తున్నాము కూరగాయలు పలు తది చెత్తల ద్వారా కంపోస్టు ఎరువులను తయారు అయ్యే విధంగా చేస్తున్నాము అని అన్నారు చెత్త ఎక్కువగా పేరుకుపోకుండా వాటిని ఉపయోగకరంగా మార్చుకోవచ్చు అని అన్నారు కానీ తడి చత్తలో కూడా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఉండటం వలన వాటిని వేరు చేయడం చాలా కష్టంగా ఉంది, తడి, పొడి చత్తలు రెండు కలిపి వేయడం వలన వాటిని రిసైకిల్ చేయలేకపోతున్నాము కావున ప్రజలు కూడా తమ ఇంట్లోనే తది చెత్తని, పొడి చెత్తని వేరు వేరుగా ఉంచి , చత్తను వేసేటప్పుడు వేరు వేరుగా ఇవ్వాలని, డంపింగ్ యార్డు సమస్య పూర్తిగా కట్టడి చేయాలన్నా, చెత్తని రిసైకిల్ చేయాలన్నా ప్రజల సహకారం కూడా పూర్తిగా ఉండాలని కోరారు.. కేవలం అధికారులు , కార్మికులు మాత్రమే కాదు, ప్రజలు కూడా బాధ్యతగా ఉంటూ సహకరిస్తేనే ఏదైనా సాధ్యం అవుతుంది అని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు...
-----------------------
Admin