సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం కోర్టు ఆవరణ నాన్ క్యాడర్ పిపి పోస్టులను క్యాడర్ చేయవద్దని జీవో 16 12 రద్దు చేయాలని ధర్నా చేయడం జరిగింది కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.. ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ మెంబర్ కొల్లి సత్యనారాయణ, నిరంజన్ రెడ్డి, బిచ్చల తిరుమలరావు , కొత్త వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం క్యాడర్ పోస్టులు 50% నాన్ క్యాడర్ పోస్టులు 50% ఉండాలని తీర్పు ఇచ్చారు. క్యాడర్ కి సంబంధించిన వారు ప్రమోషన్ల కోసం ఉద్యోగ సంఘాలతో ఒత్తిడి చేసి, ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తూ జీవో నెంబర్ 16, 12 తీసుకురావడం జరిగిందన్నారు.. ఈ జీవో ద్వారా క్యాడర్ పోస్టు ప్రమోషన్ తోని నాన్ క్యాడర్ పోస్టు లేకుండా చేయాలని కుట్ర పన్నారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం 50% నాన్ క్యాడర్ 50% క్యాడర్ ఉండాలని నాన్ క్యాడర్ పోస్టులను ప్రభుత్వం కక్షిదారులకు న్యాయం జరిగే విధంగా న్యాయనిపులను నియమించే అవకాశం ఉంది దీనివలన కక్షిదారులకు సత్వర న్యాయం అందుతుందని.. ఇట్టి విషయంపై ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ తీర్మానం చేసి సెక్రెటరీ రవి గుప్తా కి పంపడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బార్ సెక్రెటరీ చింత నిప్పు వెంకట్ ఓరుగంటి శేషగిరిరావు, తాళ్లూరి దిలీప్ చౌదరి, దిరిషాల కృష్ణారావు, పసుపులేటి శ్రీనివాసరావు, ముక్తేశ్వరరావు తదితర జూనియర్ సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు...
-----------------------
Admin