సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వారి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పుంచిన. జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ,నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్ మరియు తదితర నాయకులు. అనంతరం పువ్వాళ్ళ దుర్గాప్రసాద్,మహ్మద్ జావేద్ లు మాట్లాడుతూ.....కొలంబియా విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడని అన్నారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడని మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పని చేశాడని అన్నారు.తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడని తెలిపారు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారని తెలిపారు. 1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించిందని అన్నారు. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడని కొనియాడారు. అనంతరం జిల్లా పరిషత్ దగ్గర అంబెడ్కర్ సెంటర్ లో ఉన్న డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించినారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య,జిల్లా మైనారిటి అధ్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,కార్పొరేటర్లు మలీదు వెంకటేశ్వర్లు,దుద్ధుకూరి వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్,జిల్లా ఓ బి సి సెల్ ఉపాధ్యక్షులు గజ్జెల్లి వెంకన్న,కామా అశోక్, బానోత్ రాజు,నగర ఓ బి సి సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్,నగర యస్ టి సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్,నగర మైనారిటీ అధ్యక్షులు షేక్ అబ్బాస్ భేగ్, భూక్యా బాలాజీ నాయక్,ఖమ్మం నియోజకవర్గ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ ఏలూరి రవి,కొట్టెముక్కల నాగేశ్వరావు,బండి నాగేశ్వరావు,నూకారపు వెంకటేశ్వర్లు, వెనిగండ్ల సత్యనారాయణ,ఇబ్రహీం,కాళింగ కనకరాజు,పూర్ణచంద్ర రావు,జహీర్,బీరెడ్డి రమేష్,గోపి నాయక్,షేక్ అప్సర్,హర్ష,భీముడు,ఐలయ్య,వినోద్,నర్సయ్య,హీరాలాల్,జానీ,వీరబద్రం,షబ్బీర్,ప్రసాద్,గణేష్,దేవా తదితర నాయకులు పాల్గొన్నారు.
-----------------------
Admin