సర్కార్ టీవీ న్యూస్ / జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి భూపాలపల్లి మున్సిపాలిటీలో పనిచేస్తున్న బొల్లి రాజయ్య గారు మరణించగా వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ మున్సిపల్ కార్మికులు రెండు రోజులుగా భూపాలపల్లి మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సందర్భంగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ధర్నా స్థలానికి చేరుకొని మున్సిపల్ కార్మికులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ పొద్దున్న లేచిన దగ్గర నుండి మున్సిపాలిటీలో పారిశుధ్య పనులు చేస్తూ మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్న మున్సిపల్ కార్మికుడు బొల్లి రాజయ్య విధి నిర్వహణలో మరణిస్తే అత్యంత దారుణంగా మున్సిపల్ అధికారులు, జిల్లా అధికారులు వారి పట్ల చూపే నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తున్నాం. బొల్లి రాజయ్య కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలియచేస్తూ మునిసిపల్ కార్మికుడి కుటుంబానికి నష్ట పరిహారం చెలించాలని అదే విదంగా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ ని, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారికి తెలియచేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, వారు పట్టించుకోని పక్షంలో కార్మికులతో పాటు మేము కూడా సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. వెంటనే జిల్లా కలెక్టర్ జ్యోక్యం చేసుకుని మునిసిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter