సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : ఊట్కూర్ మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానం సంపాదించాలని మక్తల్ బిఆర్ఎస్ నేత విజేఆర్ ఫౌండేషన్ అధినేత వర్కటం జగన్నాథ్ రెడ్డి అన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 లక్షల రూపాయలతో ఐదు వేల ఆల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ బుక్స్ పంపిణీలో భాగంగా పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పోటాపోటీగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఇటు తల్లిదండ్రులకు, అటు పాఠాలు బోధించిన గురువులకు మంచి పేరు, ప్రతిష్టలు, తీసుకురావాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు వర్కటం జగన్నాథ్ రెడ్డి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామపెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin