Sunday, 26 July 2026 09:56:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బాలల సంరక్షణతో పాటు వారి ఆరోగ్యం పట్లతగు జాగ్రత్తలు తీసుకోవాలి...

Date : 21 January 2024 07:02 AM Views : 303

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బాలల సంరక్షణతో పాటు వారి ఆరోగ్యం పట్ల అవగాహన కార్యక్రమం, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు తెలిపారు. శనివారం ఐ డి ఓ సి సమావేశ మందిరంలో జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ ద్వారా సమీక్ష సమావేశం జరిగింది. చైల్డ్ కేర్ ప్లాన్ కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లల ఆరోగ్యం, వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల బాలికలకు స్కిల్ డెవలప్మెంట్ పరంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఏడుగురు బాల కార్మికులను రక్షించి బాల సదన్ కు తరలించినట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటివరకు ఇటలీకి ఇద్దరు, అమెరికాకి ఇద్దరు, ఇతర దేశాలకు 17 మంది పిల్లల్నిజిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలోపిల్లల, దత్తత తీసుకునే తల్లిదండ్రులఆరోగ్య, ఆర్థిక పరిస్థితులు తనిఖీ చేసి సంతృప్తి చెందిన పిదప, చట్ట ప్రకారం అన్ని విధివిధానాలు పూర్తి చేసి మొత్తం 19 మంది పిల్లల్ని వారి బంగారు భవిష్యత్తుపై ఉత్తమ కుటుంబాల తల్లిదండ్రులకు దత్తత ఇచ్చినట్లు సంక్షేమ అధికారిని విజేత తెలిపారు. బాల్యవివాహాల్ని అరికట్టడంలో భాగంగా 2017 వ సంవత్సరంలో 18, 2018లో 18, 2019లో-29, 2020లో -25, 2021 లో -17, 2022లో -50, 2023లో -50, 2004లో నేటి వరకు -1 బాల్యవివాహాల్ని ఆపినట్లుఆమె తెలిపారు. మిషన్ వాత్సల్య స్కీం అనుసరించి తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా 714 మంది కి నెలకు 4000 చొప్పున ఆర్థిక సాయం అందజేసినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో పర్యటించి బాలికల పాఠశాలల్లో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలుచేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి విజయ్ కుమార్, బీసీ వెల్ఫేర్ అధికారిని ఇందిర, మైనారిటీ వెల్ఫేర్ అధికారి సంజీవరావు, డిసిపిఓ ఎం. హరి కుమారి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రవి, డబ్ల్యూ సి మెంబర్స్ సుమిత్ర, అంబేద్కర్, సాధిక్ పాషా, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :