సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలంలోని పెదవీడు గ్రామపంచాయతీ నందు శ్రీ లక్ష్మీనరసింహ నాట్య కళా మండలి అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గొల్లపల్లి వీరయ్య ప్రధాన కార్యదర్శిగా ఎం మల్లేశ్వరరావు కోశాధికారిగా కే నరసింహారావు గౌరవ అధ్యక్షునిగా మొగిలి మట్టపల్లియాదవ్ ను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు గొల్లపల్లి వీరయ్య మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ కళాకారుల సమస్యలకై అన్ని విధాలుగా పోరాడుతానని అన్ని విషయాలలో మందుండి సహకరిస్తానని తన దృష్టికి వచ్చిన ఏ సమస్యలైనా అందరితో మాట్లాడి పరిష్కరించుకొని కళాకారులతో ఐక్యమత్యంగా ముందుకు నడవాలని ఆయన అన్నారు. ప్రభుత్వం నుండి కళాకారులకు అందవలసిన పెన్షన్లు గానీ ఇతర పతకాలు తమకు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ ఎన్నిక కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు పాశ్యp కృష్ణారెడ్డి, ఇంటి రవి, రంగయ్య,జి సైదులు, ఏసు పాదం తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin