సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అన్నపురెడ్డిపల్లి మండలం, గుంపెన పంచాయితీ, గుంపెన హెచ్ కాలనీ గ్రామంలో ఖాళీగా నిరూపయోగాంగా వున్న స్థలంలో కొద్దిపాటిగా నిలిచిన నీళ్లను తొలగించడానికి గ్రామంలోని ఇళ్ళ ముందు జెసిపి తో పెద్ద గోతులను, తవ్వకాలు చేశారు. పంచాయతీ సెక్రటరీ మరియు గుమస్తా వారి ఇస్తానుసారంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, గ్రామంలో చేయవలసిన అనేక అభివృద్ధి పనులను వదిలేసి, అనవసరమైన వాటిపై ప్రభుత్వ ఖజానాలను ఖర్చు పెడుతున్నారని వాపోయారు, ఇకనైనా గ్రామంలో అనేక అభివృద్ధి పనులపై దృష్టి సారించి వాటిని వేగవంతంగా చేయాలని గుంపెన పంచాయితీ గ్రామ పెద్దలు అంటున్నారు, అసలే వర్షాకాలంతో చినుకు పడితే చిత్తడిగా మారుతున్న ఈ సమయంలో గోతులు, గుంటలు చేసి స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నానని అనవసరమైన వాటిపై ప్రభుత్వ ఖజానాను ఖర్చు చేస్తున్నారని, వేటిని చేయాలో వేటిని చేయకూడదో గ్రామ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని గుంపెన పంచాయితీ వాసులు అంటున్నారు, గ్రామంలో అనేక సమస్యలు ఉన్న, వాటిపై దృష్టి సారించి వాటిని ప్రణాళిక ప్రకారం త్వరగా చేస్తే బాగుంటుందని, గుంపెన పంచాయితీ వాసులు అధికారులకు విన్నపించుకుంటున్నారు, గ్రామపంచాయతీ సెక్రెటరీ తన ఇష్టానుసారం చేసే పనులకు గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై దృష్టిసారించాలని గ్రామస్తులు విన్నపించుకుంటున్నారు...
-----------------------
Admin