సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 2024,2025 విద్యా సంవత్సరానికి గాను ఐదో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల పాఠశాల,కళాశాల ప్రిన్సిపల్ ఝాన్సీ రాణి తెలిపారు. దరఖాస్తులు చేసుకునే విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2023 2024 సంవత్సరంలో 4వ తరగతి చదువుతుండాలని విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో తెలుగు ఇంగ్లీష్ మీడియం లో నిర్వహిస్తారని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారని జనవరి 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహిస్తారని తెలిపారు
-----------------------
Admin