సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : గరిడేపల్లి మండలం తాళ్లమల్కాపురం గ్రామంలో, మాజీ సర్పంచ్ రాతికింది రామయ్య ( పల్ల) స్మారక భవన ప్రారంభోత్సవానికి నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని , రామయ్య కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి సేవలను ,ఆయన సర్పంచిగా గ్రామానికి సేవలు, జరిగినటువంటి అభివృద్ధిని, గుర్తుచేస్తూ కొనియాడారు.అదే విధంగా వారి కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసానిచ్చారు. తాళ్ళమల్కపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వట్టికూటి బాబు అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి అల్లం ప్రభాకర్ రెడ్డి ,టీపీసీసీ కార్యదర్శి సుబ్బారావు ,మండల పార్టీ అధ్యక్షుడు త్రిపుర అంజన్ రెడ్డి ,మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గుండు రామాంజిగౌడ్,మూలగుండ్ల సీతారాం రెడ్డి ,మాజీ ఎంపీపీలు రంగనాథ్ ,కటికం ఆశ రమేష్ ,మాజీ జడ్పిటిసి బచ్చలకూరి మట్టయ్య , మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బచ్చలకూరి కృష్ణ ,మండల సర్పంచ్ లు ఎంపిటిసి గ్రామ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యమగాని సైదులు,వర్కింగ్ ప్రెసిడెంట్ యమగాని నరసయ్య,గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాయి ,గ్రామ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు....
-----------------------
Admin