సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, ఫారూఖ్ నగర్ మండల్, తెలంగాణలోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో ఫారూఖ్ నగర్ మండల్ కొండన్న గూడ గ్రామాంలో సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ జెండా ఆవిష్కరించారు. సర్పంచ్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం వచ్చిక మన గ్రమ రూపురేఖలనే మారిపోయాయి. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. నేడు తెలంగాణ పల్లెలు మౌలిక వసతులతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి అని అన్నారు. అనంతరం గ్రామాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలతోపాటు పంచుకున్నారు ప్రజాభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీరాజ్ సెక్రెటరీ ప్రవళిక, స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి. వార్డ్ మెంబెర్ విష్ణు, చంద్ర రెడ్డి, మాజీ మార్కెటింగ్ డైరెక్టర్ పాపయ్య యాదవ్, మహిపాల్ రెడ్డి, బాలరాజ్, శేఖర్, కుమారి రాజు, భూపాల్ రెడ్డి, లింగం, గ్రామస్తులు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin