సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నెక్కొండ డీఆర్డీఏ మరియు ఎస్బీఐ ఆధ్వర్యంలో జూట్ బ్యాగుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ,డీఆర్డీఓ రాంరెడ్డి గ్రామాల్లో మహిళ సంఘాలు మరింత బలోపేతం కావాలని దొంతి మాధవరెడ్డి అన్నారు.నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో మహిళలకు జూట్ బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమం డీఆర్డీఏ మరియు ఎస్బీఐ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో నిర్వహించారు ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని,అదే విధంగా మహిళా సంఘాల సభ్యుల సభ్యులు ప్రభుత్వ సహకారంతో కుటీర పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగు పరుచుకోవాలి అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాలు,పెరుగు, కూరగాయలు పెంపకం ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని,నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా గ్రామాల్లోనే మార్కెట్ లభిస్తుందని అన్నారు. అదే విధంగా గ్రామంలోని14 మహిళా సంఘాలకు 2 కోట్ల70 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలను సంఘాల సభ్యులకు అందించారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ రేణుకాదేవి,నర్సంపేట,నెక్కొండ మార్కెట్ ఛైర్మెన్లు పాలయి శ్రీనివాస్,హరీష్ రెడ్డి,పీసీసీ మెంబెర్ రంజిత్ రెడ్డి,పెండెం రామానంద్,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter