సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోకవర్గం కేశంపేట్ మండలంలో ని కొత్తపేట్, కోనాయిపల్లి, భోదనంపల్లి, చౌలపల్లి గ్రామాలలో నమో ఆరోగ్యమస్తు వైద్య శిబిరాలను మండల అధ్యక్షులు పసుల నరసింహులు యాదవ్ ఆధ్వర్యంలో పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి సీనియర్ నాయకులు పాలమూరు ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్ సింగ్ నాయక్, శ్రీనివాసులు, సుందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, ఆకుల ప్రదీప్ చొప్పరి నరసింహ, గిల్వా రెడ్డి, కే నరేందర్ రెడ్డి, ఐలయ్య నరేందర్, గోపాల్ రెడ్డి, కుమ్మరి చందు, రాజశేఖర్ బి కుమార్ టి పాండురంగారెడ్డి, అల్లం ప్రతాప్ రెడ్డి, భవనం వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. 30 రోజుల కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు అయిన ఈ రోజు కొత్తపేట్, కోనాయిపల్లి, భోదనంపల్లి , చౌలపల్లి గ్రామాల్లోని వయోజనులు వైద్య సమస్యలతో బాధపడుతున్న మహిళలు మొత్తం 1100 మంది ఎంబిబిఎస్ డాక్టర్లచే ట్రీట్మెంట్ అందుకున్నారని, అలాగే అవసరమున్నవారందరికీ ఉచితంగా మందులు అందించామని మీడియా సమావేశంలో తెలియజేశారు.
-----------------------
Admin