Sunday, 26 July 2026 02:19:30 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

షాద్ నగర్ అసెంబ్లీ బిజెపి అభ్యర్థిగా అందె బాబయ్య దరఖాస్తు...

Date : 10 September 2023 09:22 AM Views : 263

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : 40 ఏళ్ల పాటు షాద్ నగర్ రాజకీయాల్లో ఎన్నో విధాల సేవలు అందించి నేడు భారతీయ జనతా పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్నానని ప్రస్తుతం బడుగు బలహీన వర్గాల్లో బలమైన అభ్యర్థిగా తాను బరిలో ఉంటానని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నారు. అపార రాజకీయ అనుభవంతో నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించినట్లు అందే బాబయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గంలో ఆయా పార్టీలో టికెట్ ఇవ్వకుండా రాజకీయంగా ముదిరాజులను అణిచివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజులకు సామాజిక న్యాయం రాజకీయ చైతన్యం కల్పించాలంటే కచ్చితంగా తనకు బిజెపిలో టికెట్ వస్తుందని ఆశలు వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గత 40 ఏళ్లుగా అనేక పార్టీలకు సేవలు అందించానని చెప్పారు. అన్ని పార్టీలు తనను నమ్మించి ద్రోహం చేశాయని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీపై తనకు అపారమైన విశ్వాసం ఉందని నమ్మకం వ్యక్తం చేశారు. ఈటెల రాజేందర్ ఆశీస్సులతో తనకు కచ్చితంగా టికెట్ లభిస్తుందని ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక కోటాలో తన టికెట్ కచ్చితంగా కేటాయించబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు దేపల్లి అశోక్ గౌడ్, చెట్ల వెంకటేష్, కురుమయ్య, ఎంకనొల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: