సర్కార్ టీవీ న్యూస్ / ఢిల్లీ : తెలంగాణ న్యాయవాదుల ఆరోగ్య బీమా పథకం పై "మెడ్సేవా"కు వినతి – జిల్లాల వారీగా హాస్పిటల్లను పెంచాలని, రీఈంబర్స్మెంట్ వేగవంతం చేయాలని తాళ్లూరి దిలీప్ కోరారు ఫెడరేషన్ ఆఫ్ లీగల్ ప్రొఫెషనల్స్ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం బార్ అసోసియేషన్ మెంబెర్స్ తాళ్లూరి దిలీప్, పసుపులేటి శ్రీనివాస్ ఢిల్లీలోని మెడ్సేవా TPA సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా 2 అంశాలపై వినతి: 1. తెలంగాణా రాష్ట్రంలో నెట్వర్క్ హాస్పిటల్స్ విస్తరణ భద్రాద్రి కొత్తగూడెం, భద్రాచలం, ములుగు, మంఛిర్యాల, అదిలాబాద్ వంటి జిల్లాల్లో రిమోట్ మరియు గిరిజన ప్రాంతాలలో హాస్పిటల్లను తక్షణంగా ఎంపానెల్ చేయాలంటూ విజ్ఞప్తి. 2. వైద్య బీమా క్లెయిమ్ రీఈంబర్స్మెంట్ వేగవంతం న్యాయవాదులకు 15 రోజుల్లోగా రీఈంబర్స్మెంట్ పూర్తిచేయాలి క్లెయిమ్ ట్రాకింగ్ మరియు హెల్ప్డెస్క్ను అందుబాటులో ఉంచాలి. మెడ్సేవా అధికారులు శ్రీ దీపక్ కుమార్ గారు మరియు శ్రీమతి గీత స్పందిస్తూ, హాస్పిటల్స్ ఎంపానెల్ ప్రక్రియ వేగవంతం చేస్తామని, న్యాయవాదులకు త్వరిత రీఈంబర్స్మెంట్ అందించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. "న్యాయవాదుల ఆరోగ్య హక్కులకు ఇది కీలకమైన పథకం. దీనిని గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాల్సిన అవసరం ఉంది," అని తాళ్లూరి దిలీప్ పేర్కొన్నారు.
-----------------------
Admin