సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డు లకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కొత్త జీతాలను వెంటనే అమలు చేయాలని ఏఐటియుసి మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం దేవరకొండ జరిగిన మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేతనాల పెంచాలని ఎన్నో పోరాటాలు చేసి తాత్కాలికంగా జీవో 60 సాధించడం జరిగిందని పేర్కొన్నారు. పెరిగిన వేతనాల జీవో నెంబర్ 60 ప్రకారం వెంటనే అమలు చేయాలని ఆయన అధికారులు కోరారు. కొత్త టెండర్ల ప్రకారం వెంటనే అగ్రిమెంట్ చేసుకుని జివో ప్రకార వేతనాలు ఇచ్చే విధంగా కాంట్రాక్టర్ను ఆదేశించాలని దేవేందర్ రెడ్డి అధికారులను కోరారు. పెరుగుతున్న ధరలతో పోల్చుకుంటే కార్మికులకు వచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ తక్కువ జీతాలతో కార్మికుల కుటుంబాలు గడవడం ఇబ్బందికరంగా ఉందని అన్నారు. కరోనాలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసిన హాస్పిటల్ కార్మికులకు ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. కార్మికులకు కూడా ప్రభుత్వ 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో AITUC నియోజవర్గ కార్యదర్శి నూనె రామస్వామి మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు రామేశ్వరమ్మ బద్రమ్మ,తారమ్మ, ప్రణయ్,అరుణ,శాంతీ, పద్మ,జయమ్మ,లింగమ్మ, రాణి,సునీత,సుజాత, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin