సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అసెంబ్లీ బరిలో ఏడు గురు తమ నామినేషన్లను పూర్తిగా ఉపసంహరించుకున్నారు. బుధవారం జరిగిన ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా తమ నామినేషన్లను స్వతహాగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అసెంబ్లీ బరిలో 14 మంది పోటీలో ఉంటారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి డి. వెంకట మాధవరావు మీడియాకు తెలిపారు. ఉప సంహరించుకున్న వారిలో ఆలుగడ్డ ఇందిర, ఆలుగడ్డ ప్రవీణ్ యాదవ్, మఠం శశిధర్, సింగపగ శివకుమార్, అందే రాజేశ్వర్, పల్లె సత్యనారాయణ, ఎమ్మే సంతోష్ కుమార్ తదితరులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు...
-----------------------
Admin