సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణంలో మంగళవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ నరేందర్ కమిషనర్ వెంకన్న తదితరుల ఆధ్వర్యంలో ప్రభుత్వపరంగా జయంతి వేడుకలు జరిపారు. తెలంగాణ మట్టిలోనే పోరాట తత్వం ఉందని చెప్పడానికి ఐలమ్మ జీవితమే నిదర్శనమని ఎమ్మేల్యే చెప్పుకొచ్చారు. హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తి తో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం, రాష్ట్ర ప్రభుత్వం కృషి సాగిస్తున్నదని వివరించారు. ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను స్మరించుకుంటున్నామని ఆంజన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కాలుకు అనంతయ్య టిఆర్ఎస్ నాయకులు జూపల్లి శంకర్, పిల్లీ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin