సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : శుక్రవారం లక్ష్మీదేవి పల్లి మండలం లోతు వాగు గ్రామపంచాయతీ కార్యాలయానికి అద్దె చెల్లించని కారణంగా ఇంటి యజమాని తాళం వేయడం జరిగింది. లోతు వాగు గ్రామపంచాయతీ కార్యాలయం ప్రైవేట్ భవనంలో ఉండడంవల్ల ప్రభుత్వం నుండి బిల్లులు రాక కార్యాలయం అద్దె కట్టలేని కారణంగా ఆ ఇంటి యజమానురాలు కార్యాలయానికి తాళం వేసింది. శుక్రవారం యధావిధిగా కార్యాలయానికి వచ్చిన కార్యదర్శి గేటుకి తాళం వేయడంతో ఆశ్చర్యపోయాడు. వెంటనే అక్కడికి ఉపసర్పంచ్ రజాక్ అక్కడికి చేరుకొని మండల అధికారుల పైన ఆవేశం వ్యక్తం చేశారు. అద్దె భవనాన్ని తాళం తీపియాల్సిన బాధ్యత సర్పంచ్ ది కానీ ఆ సర్పంచ్ పడిగా ప్రశాంత్ ఇటీవల మైనర్ బాలిక అత్యాచారం కేసులో పోసుకో కేసు నమోదై రిమాండ్ వెళ్లడం జరిగింది. కావున మండలాధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. పలు అభివృద్ధి పనులు చేసిన కాంట్రాక్టర్లు కార్యాలయానికి తాళం వేయడంతో బిల్లులు రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలకి పట్టించుకునే మండలాధికారులు ఇంత జరుగుతున్న నిమ్మకు నీరుతున్నట్టు ఉన్నారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ యధావిధిగా సాగేలా చూడాలని పంచాయతీ ప్రజలు మరియు కార్యవర్గం కోరుకుంటుంది....
-----------------------
Admin