సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుళదేవరచెరువు మండలంలోని ఆలాపల్లి పంచాయతీ ఉగ్గిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం గ్రామస్తుల ఆధ్వర్యంలో పురోహితులు పంచరత్న సురేష్ శర్మ బృందం వేదమంత్రాలతో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవం నిర్వహించారు.5వ తేది వైశాఖ పౌర్ణమి స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయస్వామి వార్ల విగ్రహాలకు నవధాన్యాలు, కలశ పూజలు,విగ్రహాల ప్రాణ ప్రతిష్టస్థాపన పూజలు మూడు రోజులు భక్తిశ్రద్దలతో నిర్వహించి, కొబ్బరి,అరటి,మామిడి ఆకుల తోరణాలతో అలంకరణ చేసిన పచ్చని పందిళ్ల కింద సీతారాముల పంచాలోహ విగ్రహాలకు పుష్పమాలధారణతో శాస్త్రోక్తంగా కన్యాదానం,కంకణాలు, మంగళసూత్రాలు సమర్పించి కమనీయముగా కళ్యాణమహోత్సవం నిర్వహించారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ కునుకుంట్ల శ్రీధర్, జడ్పీటీసీ కుర్లి దామోదర్ రెడ్డి,ఆర్ఐ నాగేంద్ర, సామకోటి ఆదినారాయణ,సర్పంచ్ వెంకటరమణ,ఎంపిటిసి,బొడ్డు జయన్న,మధు, ఆలయ నిర్మాణ సంకల్పకులు పచ్చార్ల ఆంజనేయులు నాయుడు,యువ సేవకులు మల్లెల రమేష్ తదితరులు పాల్గొనగా పరిసర గ్రామాల నుండి కల్యాణమహోత్సవం దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు గ్రామస్తులు తీర్థ అన్న ప్రసాదాలు అందించారు.
-----------------------
Admin