సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : లక్ష్మిదేవిపల్లి మండల నాయకుల ఆధ్వర్యంలో శ్రీనగర్ పంచాయతీలో నిర్వహించిన గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, రాష్ట్ర నాయకులు ఊకంటి గోపాల్ రావ్, తూము చౌదరి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. సామాన్య ప్రజలు బాగుండాలంటే కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేలా ప్రజలు కూడ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ సిలిండర్ రేట్లు 200 రూపాయలు తగ్గించడం జరిగిందని ఇది ఎన్నికల డ్రామా అన్న విషయం ప్రజలు గుర్తించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి 4 వేలు పెన్షన్లు, పేదలకు ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, అర్హులందరికీ రేషన్ కార్డులు, 500/-రూపాయలకే గ్యాస్ సిలిండర్, చదువుకుంటున్న 18 సంవత్సరాల బాలికలకు ఉచిత స్కూటీ మరియు రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ లోని అంశాలను పూర్తిగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో పెద్ద బాబు, గుర్రం వెంకటేశ్వర్లు, వరప్రసాద్, పూణెం శ్రీనివాస్, మైనార్టీ నాయకులు గౌస్ భాయ్, అయూబ్ ఖాన్, తాండ్ర నాగబాబు,సుందర్లాల్ కోరి, సురేషు, నాగేశ్వరరావు, నాగరాజు, ఓదెలు, శేఖర్, దుర్గారాశి సతీష్, పండు, నిరంజన్ రెడ్డి,దేవరగట్ల ప్రసాద్, నరసింహారెడ్డి రెడ్డి, భద్రం, రవి, నరేష్, కుమార్, ఉదయ్ కుమార్, మహిళా నాయకురాళ్ళు, కవిత, సరోజినీ, నాగమ్మ , మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
-----------------------
Admin