Sunday, 26 July 2026 02:41:35 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వం... - మండవ వెంకటేశ్వర్లు గౌడ్

Date : 10 July 2023 06:52 AM Views : 253

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికులను వెట్టిచాకిరి చేయిస్తూ వారిని శ్రమదోపిడికి గురిచేస్తుందని తెలుగుదేశం పార్టీ నల్గొండ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి , హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్ విమర్శించారు. గ్రామపంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం టిఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషిపతి ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేసి మాట్లాడారు. పొద్దుగాల లేసి గ్రామాలను శుభ్రం చేస్తూ స్వచ్ఛతకు మారుపేరుగా నిలుస్తున్న సిబ్బంది పట్ల ప్రభుత్వం ఉదాసీనతగా ఉండటం తగదన్నారు . గ్రామపంచాయతీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేయాలని , 11వ పిఆర్సి లో నిర్ణయించిన ప్రకారం 19 వేల రూపాయల వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. పంపు ఆపరేటర్లు , ఎలక్ట్రిషన్స్ , డ్రైవర్లు , కారోబార్లు , బిల్లు కలెక్టర్లకు 19500 వేతనం చెల్లించాలని , ప్రమాదంలో మరణించిన వారికి పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో *హుజూర్ నగర్ పట్టణ పార్టీ కన్వీనర్ కొమ్మ గాని వెంకటేశ్వర్లు గౌడ్ , పార్టీ సీనియర్ నాయకులు కష్టాల కనకరత్నం, పెండెం అంజయ్య గౌడ్, వల్లపు దాసు కోటయ్య తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :