సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడుమండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా తెలంగాణ రైతుసంఘం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యులు పాతూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ రైతులకు లక్ష రూపాయల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు హామీలను ఇస్తూ హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని, విడతల వారీగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అది కూడా అమలు కావడం లేదని రుణమాఫీ అమలు కాకపోవటం వల్ల రైతులపై తీవ్ర వడ్డీ భారం పడుతున్నదని కొన్ని బ్యాంకుల్లో రైతుబంధు డబ్బులను రుణం కింద జమ చేసుకుంటున్నారని ఆయన ఆవేదనవ్యక్తంచేశారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి లక్ష రూపాయలు లోపు రుణము రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని, లేని యెడల రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.ధర్నా అనంతరం తాసిల్దార్ శ్రీదేవి కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు కందగట్ల అనంత ప్రకాష్ పిఎసిఎస్ వై చైర్మన్ పగడాల మట్టేశ్,రైతునాయకులు ఎర్రడ్ల మల్లారెడ్డి ఆర్లపూడి వీరభద్రం గుర్రం ధనమూర్తి,మాజీ సర్పంచ్ మీసాల కాశయ్య కొండా పెద్దఎల్లయ్య,కీసర మల్లయ్య,చాపలమల్లయ్య, ఏసురత్నం తదితరరైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin