సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎన్నికలు బిజెపి పార్టీని ఆదరించి కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని, భారతీయ జనతా పార్టీ ద్వారానే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అందె బాబయ్య అన్నారు. ఆదివారం షాద్ నగర్ మున్సిపాలిటీలోని 10వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన బిజెపి అభ్యర్థి అందే బాబయ్య పేద ప్రజల కోసం ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి బిజెపి సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. షాద్నగర్ నియోజకవర్గం లో బీజేపీ పార్టీ గెలుపే లక్ష్యం గా ముందుకు సాగుతున్న కమల దళంతో అందరూ కలిసి రావాలని కోరారు. ఇంటింటికి మోదీ గారి సంక్షేమ పథకాలను తీసుకెళ్లాడమే కార్యకర్తల బాధ్యతగా సాగుతున్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాతపల్లి కృష్ణ రెడ్డి ,శేరి విష్ణువర్ధన్ రెడ్డి, మల్చలం మురళి, చెట్ల వెంకటేష్, వంశీకృష్ణ, పట్టణ అధ్యక్షుడు మఠం ఋషికేశ్ , శ్రీనివాస్ చారి, జంబుల నరసింహులు, పసులోటి శ్రావణ్ , బీజేవైఎం అధ్యక్షుడు సాయి గౌడ్, గూడూరు సుధాకర్, రంగన్న గౌడ్, శ్యామ్ సుందర్, హరి భూషణ్, నక్కల మల్లేష్ , భాగం మధుసూదన్ గౌడ్, పిట్టల యాదయ్య, జనార్దన్ రెడ్డి, విజయ్ గౌడ్, రాఘవేందర్, వన్నాడ శివ, శ్రీనాథ్, అక్షయ్, శ్రీను, నాని, రాజేష్, ఈశ్వర్ లతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin