సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : చుంచుపల్లి మండల పరిధిలోని 2 ఇంక్లైన్ కు చెందిన సగ్గు మల్లేశ్వరి తన కూతురు సరయు రెడ్డి కలసి గురువారం రామవరం నుండి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ జంక్షన్ కు ఆటో లో ప్రయాణిస్తు ఉండగా తన బంగారు చేతి గొలుసు (బ్రాస్లెట్) ఎక్కడోపడింది. ఆటో డ్రైవర్ వారిద్దరిని గమ్యస్థానానికి చేర్చి తిరిగి తన ఆటోలో గమనించగా వెంటనే ఆ ఆటో డ్రైవర్ సంపంగి సాంబా, 5ఇంక్లైన్ తన ఆటో లో పడిపోయిన బంగారు గొలుసు ను తీసుకొని వెళ్లి 2టౌన్ సి.ఐ రమేష్ కి తెలియజేసి ఆ గొలుసును అప్పగించాడు. వెంటనే సిఐ అతనిని అభినందించారు. ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు అందరూ ఇలా బాద్యత గా ఉండాలని , ఆటోలల్లో ప్రయాణించే ప్రయాణికుల తోటి మర్యాదగా మెలగాలని అది మీ అందరి బాధ్యత అన్నారు. బంగారు బ్రాస్లెట్ సంబంధించిన వాళ్లకి స్టేషన్ కు పిలిచి వారికి అందజేశారు.
-----------------------
Admin