సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ నగరపంచాయతీ పరిధిలో ఉన్న ఇస్లాపురంలో గత 15 రోజుల నుండి తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న మహిళలు ప్రజలు నీళ్లు లేకపోవడంతో పంట పొలాల్లోకి మహిళలు పోయి3 కిలోమీటర్ల నుంచి నీళ్లు తీసుకువచ్చే పరిస్థితి తాగునీరు లేక ప్రజలు కటకటలాడుతున్నారు. తక్షణమే నీటి సమస్య పరిష్కరించాలని పెనుకొండ నగర పంచాయతీ కార్యాలయంలో ఏఈ రాజేంద్ర కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నీటి సమస్య పరిష్కారం కాకపోతే మహిళలతో రోడ్డులో రాస్తారోకో నిర్వహిస్తామని అధికారులకు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రమేష్ , సిఐటియు మండల కార్యదర్శి బాబావలి, టిడిపి నాయకులు హనుమంతు, సత్యం,పోతన్న ,హనుమన్న ,సురేష్ ,శ్రీరాములు ,హరి, 3వ వార్డుకౌన్సిలర్ గిరి, రాజు తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin