సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గం: నాగారం మండలం డి.కొత్తపల్లి గ్రామంలో మొన్న రాత్రి చిన్నారి కాసం పావని తండ్రి కాసం సోమయ్య పై దాడి ఘటనలో కూతురు పావని మృతి చెందడంతో వారి నివాసానికి వెళ్లి చిన్నారి పావని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి , తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ , వారి వెంట ఎంఎల్సీ కోటిరెడ్డి , మాజీ ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ , ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్ , చిరుమర్తి లింగయ్య , రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు పెరిగిపోయాయి.రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిస్తేజమైపోయింది కాసం సోమయ్య కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య రాజకీయాలకు సంబంధంలేని వ్యక్తిపై కర్రలు, రాడ్లతో దాడి చేయడం బాధాకరం కాంగ్రెస్ నాయకుల అనుమతులతోనే కేసులు, దాడులు చేస్తున్నారు... ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పోలీసు వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది పదేళ్ల తర్వాత రాష్ట్రంలో చైన్స్ స్నాచింగ్, దొంగతనాలు, జాతీయ రహదారులపై దోపిడీలు జరుగుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ప్రతిరోజు హత్యలు, దాడులు చూస్తున్నాం రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది తెలంగాణను ఒక స్మశానం చేసే పరిస్థితి కాంగ్రెస్ తీసుకువచ్చింది.కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధిస్తే నేడు అగమ్యగోచరంగా కాంగ్రెస్ నాయకులు మారుస్తున్నారు.ఎక్కడ కూడా రాజకీయ కక్షలు, దాడులు చేయకుండా పదేళ్లు బీఆర్ఎస్ పాలన చేసింది 8 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ చీకటి రోజులే దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుపోతే సహించేది లేదు పోలీసు అధికారులు కాంగ్రెస్ నాయకుల దాడులపై చర్యలు తీసుకోకపోతే మళ్లీ రావణ కాష్ట అయితది నల్లగొండ జిల్లాలో ప్రజలకు తిరుగుబాటు తెలుసు.. రజాకార్లను తరిమికొట్టిన ప్రాంతం, మాకు కొట్లాటలు కొత్తేమి కాదు కాసం సోమయ్యపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిఆయన అన్నారు.
-----------------------
Admin