సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక మేజర్ పంచాయతీలో. గత నాలుగు రోజులుగా తాగడానికి మంచినీళ్లు రాక రాజీవ్ నగర్ ఒడియా క్యాంప్,గాంధీ నగర్ ,భాస్కర్ నగర్, విజయనగర్, బసవపు క్యాంప్ ,కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు అని. సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షుడు,మాజీ ఉపసర్పంచ్ పేలాల శ్రీనివాస్ శనివారం ఒక సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం సారపాక అని ఎండ తీవ్రతతో అల్లాడిపోతున్న ప్రజలు దాహం దాహం అంటున్నారు.. కానీ త్రాగునీరు రాక నాలుగు రోజులు అవుతున్న అధికారులకి చలనం లేదు అని. ఈ సారపాక గ్రామ పంచాయతీలో ఆదాయం వచ్చే పనులు తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులేమీ పట్టించుకోవడం లేదు అని, ప్రజలు ఆరోపిస్తున్నారు అని. ఈ పంచాయతీకి ప్రత్యేక అధికారులుగా జిల్లా స్థాయి వారు ఉండటం గమన హారం కానీ. పనులు మాత్రం శూన్యం ప్రజలు అంటున్నారు మరి ఇంకా ఎన్ని రోజులకు మంచినీళ్లు వస్తాయని ప్రజలు ఎదురుచూస్తున్నారు ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరని అధికారులు స్పందించి వెంటనే త్రాగునీరు వచ్చేలా చేయాలని ఆయన అన్నారు..
-----------------------
Admin