సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు త్రిపురము అంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,జాతీయ నాయకులతో కలిసి , ఢిల్లీలోని ఎలక్షన్ కమిషన్ కి, నోటిఫికేషన్ డేట్ నవంబర్ 3 కంటే ముందు దళిత బంధు,రైతు బంధు,కళ్యాణ లక్ష్మి, సంబంధించినటువంటి లబ్ధిదారులకు, డబ్బులు ఇవ్వవలసిందిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు.కానీ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వక్రీకరించి ,నీతి నిజాయితీ గల ఎం పి పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిని మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ఇలాంటి చర్యలకు దిగితే తగిన గుణపాఠం చెప్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మూల గుండ్ల సీతారాం రెడ్డి,గుండు రామంజి గౌడ్, టి పీ సీ సీ సభ్యులు రంగనాథ్,కటకం రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బచ్చల కూరి కృష్ణ ప్రసాద్, జిల్లా నాయకులు సత్యనారాయణ, చాందిమియా, బీసీ సంఘం నాయకులు నాగరాజు, కిసాన్ సెల్ అధ్యక్షులు కందుల కోటి రెడ్డి ,ఎంపీటీసీలు సందీప్,రమేష్,శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin