సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : పెనుబల్లి మండలం ఎడ్ల బంజర గ్రామానికి చెందిన జగిని మౌనిక కు కల్లూరు మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీపీ వలసల విజయలక్ష్మి, నరసింహారావు కుమారుడు మని కృష్ణతో 2020 జనవరి 9న వివాహం జరిగిందని, వివాహ సమయంలో 20 లక్షల రూపాయల నగదు తో పాటు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమిని, మరియు మూడు లక్షల విలువైన బంగారం ఇచ్చి నప్పటికి వివాహమైన మూడు నెలల తర్వాత అదనంగా 25 లక్షల కట్నం తీసుకురావాలని మానసికంగా భౌతికంగా దాడి చేశారని, గర్భవతిని అని చూడకుండా ఇనుపరాడుతో కొట్టి చంపేందుకు ప్రయత్నించారని, వారి బారి నుండి తప్పించుకొని తన పుట్టింటికి వచ్చానని ఆమె పెనుబల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కావాలని వేధిస్తున్న భర్త అత్తమామలు ఆడపడుచులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ మౌనిక వేడుకుంటుంది.
-----------------------
Admin