సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ యూత్ నాయకులు కిరణ్ గారి తండ్రి లింగబోయిన ఎల్లయ్య గారు ఈరోజు ఉదయం ఆకాల మరణం చెందారని తెలిసి వారి నివాసానికి వెళ్లి లింగబోయిన ఎల్లయ్య గారి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్సీ టిపిసిసి సభ్యులు పొట్ల నాగేశ్వరరావు గారు. అనంతరం కిరణ్ పరామర్శించి ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వీరాపురం రామలక్ష్మణ్ రావు, అల్లాడి నరసింహ రావు, కాపా శ్రీనివాస్ రావు, సంగు యాలాద్రి, యూత్ కాంగ్రెస్ నాయకులు మధు, మణికంఠ, జెట్టి, సాయి, దాము తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin