సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మందలపల్లి ఫారెస్ట్ బీట్ లో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించడానికి ఎంపిడిఓ చంద్రశేఖర్, MPO కృష్ణ ల చొరవతో ఇటీవల ఫారెస్ట్ అధికారులు ఐదు ఎకరాలు స్థలం కేటాయించారు. ఈరోజు బృహత్ పల్లె ప్రకృతి వనం నిర్మాణ పనులు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో మందలపల్లి సర్పంచ్ మడివి దుర్గ, ఉప సర్పంచ్ దిశ కమిటీ సభ్యులు గారపాటి సూర్యనారాయణ, ఉపాధి హామీ పథకం టిఏ నాగమణి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin