సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : తాడిపత్రి పట్టణానికి చెందిన వేణు, అంజి, హేమంత్, మహమ్మద్, షెక్ష, పవన్ కుమార్ రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, నవీన్, రహీమ్, గౌతం, సురేష్ తో పాటు మరో సుమారు 190 మంది యువకులు టిడిపి పార్టీని వీడి తాడిపత్రి వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యాలయం లో యువ నాయకుడు "కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి" సమక్షంలో వైస్సార్సీపీ పార్టీ లోకి చేరారు. యువ నాయకులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , ఎమ్మెల్యే శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై వైఎస్సార్సీపీ పార్టీ లో చేరుతున్నట్లు వారు తెలిపారు. అంతే కాకుండా తాడిపత్రి పట్టణం శ్రీనివాసపురం కు చెందిన నారాయణ స్వామి ఆచారి, శేషయ్య ఆచారి, శివయ్య, కేశవాచారి, సోము కుటుంబాలతో పాటు మరో ఐదు కుటుంబాలు యువ నాయకులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
-----------------------
Admin