సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి : మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ కనకదుర్గమ్మ తల్లి పండుగ వన భోజనాల మహోత్సవానికి హాజరై కనకదుర్గ అమ్మవారి తల్లి ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలందరికీ శ్రావణమాస శుభాకాంక్షలు తెలియ జేస్తు కనకదుర్గమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి దీవెనలు ప్రజలందరి మీద ఉండాలని, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి ని దీవించి ప్రజలందరికీ ఈ అభివృద్ధి ఫలాలు పంచేందుకు మరింత ధైర్యాన్ని ఆశీస్సులను ఇస్తూ దుష్ట శక్తులను తరిమి వేసేలా ప్రజలందరికీ మంచి శక్తిని ప్రసాదించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అమ్మవారులను కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు పెద్దలు, కార్యకర్తలు భక్తులు పాల్గొనడం జరిగింది....
-----------------------
Admin