సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఈనెల 16న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి నాయకుల ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని పలు వస్త్ర దుకాణాల్లో పనిచేస్తున్నకార్మికులకు, కేంద్ర ప్రభుత్వ ,కార్మిక, ప్రజా ,వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పించారు. అనంతరం కార్మికులకు కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కంచర్ల జములయ్య గెద్దాడి నగేష్ మాట్లాడుతూ బిజెపి కోసంప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుండి కార్మిక, ప్రజా, రైతు ,వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని అన్నారు. గత పది సంవత్సరాలుగా బిజెపి దేశంలో అనుసరిస్తున్న మతతత్వ ,ఆర్థిక ,విధానాల వల్ల ప్రజల జీవనాధాయం తగ్గుతూ పేదల సంఖ్య పెరుగుతున్నదన్నారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తిరిగి రాయితీలను ప్రకటిస్తూ ప్రజలను దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. గతంలో రైతులపై నిందించబడిన కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. చనిపోయిన 750 రైతు కుటుంబాలకు ఇప్పటికైనా నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధరలకంటే తక్కువ అమ్మడం వల్ల ప్రతి సంవత్సరం నాలుగు లక్షల కోట్లు రైతులు నష్టపోతున్నారని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ కమిటీల పిలుపుమేరకు ప్రజలందరూ ఈ నెల 16న జరగబోవు సమ్మెలో భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా నాయకులు వీరస్వామి, త్రినాథ్ చప్పిడి కోటేశ్వరరావు సందబోయిన శ్రీనివాస్ జీవి మాల్, సీఎంఆర, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
-----------------------
Admin